ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 6, 2022, 9:57 AM IST

ETV Bharat / city

VIP's at Tirumala: తిరుమల వైకుంఠనాథుని సేవలో రాజకీయ, సినీ ప్రముఖులు

VIP's at tirumala: తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

political leaders and film actors offers prayers to lord balaji at tirumala
తిరుమల వైకుంఠనాథుని సేవలో రాజకీయ, సినీ ప్రముఖులు

VIP's at tirumala: తిరుమల శ్రీవారిని.. సినీ నటులు జాన్వీ కపూర్, మహేశ్వరి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయాధికారులు వారికి తీర్థప్రసాాదాలను అందించారు.

స్వామివారి సేవలో రాజకీయ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్చించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, తెదేపా ఎమ్మెల్సీ రామారావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మూలవిరాట్టు దర్శనానంతరం.. రంగనాయకుల మండపంలో వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details