ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదేకు రూ.12.65 లక్షల విలువైన ఊరగాయలు విరాళం - tirumala latest news

తితిదేకు రూ.12.65 లక్షల విలువైన ఊరగాయలు విరాళంగా అందాయి. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన విజయ ఫుడ్ ప్రొడక్ట్స్ అధినేత కె.రాము.. ఊరగాయలను అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

pickles donation to ttd by vijaya food production
pickles donation to ttd by vijaya food production

By

Published : Feb 18, 2021, 5:17 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.12.65 లక్షల విలువైన ఊరగాయలు విరాళంగా అందాయి. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన విజయ ఫుడ్ ప్రాడక్ట్స్ అధినేత కె.రాము వీటిని.. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

విరాళంగా ఇచ్చినవాటిలో... 7 రకాల.. 4,500 కిలోల ఊరగాయలు, 300 కిలోల పసుపు పొడి, 200 కిలోల కారం పొడి, 300 కిలోల పులిహోర పేస్ట్ ఉన్నట్లు తెలిపారు. తితిదే అన్నప్రసాదం భవనంలో భక్తులకు వీటిని వడ్డించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details