ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీవారి లడ్డూ పోటు సిబ్బంది దాతృత్వం.. తోటి కార్మికుడి కుటుంబానికి సాయం

By

Published : Nov 23, 2020, 7:52 AM IST

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటులో సుధాప్రకాశ్ అనే కార్మికులు అనారోగ్యంతో మృతి చెందాడు. స్పందించిన తోటి సిబ్బంది... తమ వంతుగా రూ.4 లక్షల రూపాయలను సేకరించారు. బాధిత కుటుంబానికి విరాళంగా అందించారు.

person  made Srivari laddu prasadam died at thirupathi
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసే వ్యక్తి మృతి...తోటి సిబ్బంది సహాయం

అనారోగ్యంతో మృతి చెందిన పోటు కార్మికుని కుటుంబానికి.. తోటి సిబ్బంది ఆర్థిక సాయం అందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటులో సుధాకర్ అనే వ్యక్తి.. దీర్ఘకాలికంగా సేవలందించారు. ఇటీవల అనారోగ్యంతో అతను మృతి చెందాడు. తోటి సిబ్బంది స్పందించి.. తమ వంతుగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. 421 మంది తమ ఒక్క రోజు వేతనాన్ని సేకరించారు. మొత్తం 4 లక్షల రూపాయలను అదనపు ఈవో ధర్మారెడ్డి చేతుల మీదుగా సుధాప్రకాష్ కుటుంబానికి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details