తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... సూళ్లూరుపేట, నాయుడుపేటలో ప్రసంగించారు. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని ప్రచారంలో కోరారు.
"మీ బాబాయి హత్యతో మాకు సంబంధం లేదని తిరుపతి వెంకన్నపై ప్రమాణం చేస్తా.. మీరూ చేస్తారా? జగన్ రెడ్డి" అని బహిరంగ వేదికపై సవాల్ విసిరారు. తోలు బొమ్మలాంటి వారిని వైకాపా నుంచి పార్లమెంట్కు పంపితే రాష్ట్రానికి ఉపయోగం లేదని లోకేశ్ అన్నారు. వైకాపా ఎంపీలు రాష్ట్రానికి ఏం ఉద్దరించారని ప్రశ్నించారు.