ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సేవలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ - తిరుమలలో ఎమ్మెల్యే జోగి రమేష్ వార్తలు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, వైకాపా నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

vips at tirumala
శ్రీవారి సేవలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్

By

Published : Jan 6, 2021, 11:56 AM IST

తిరుమల శ్రీవారిని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్, వైకాపా నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రామతీర్థం ఘటన బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘటన ముఖ్యమంత్రి జగన్​దేనని వైకాపా నేత ఉమారెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అన్నీ ఇస్తున్నా... ప్రతిపక్షం కావాలనే నిందిస్తుందని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details