ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 11, 2021, 7:37 PM IST

ETV Bharat / city

రుయా ఆసుపత్రి విషాదాన్ని రాజకీయం చేయడం తగదు: ఎమ్మెల్యే భూమన

తిరుపతి రుయా ఆసుపత్రిని.. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సందర్శించారు. జరిగిన ఘోర విషాదానికి కారణం.. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

mla bhumana karunakar reddy
ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావటం వల్లే.. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోర విషాదం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి.. మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ఈ తరహా ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

ఇదీ చదవండి:'ఆవుపేడ థెరపీ'తో కరోనా తగ్గుతుందా?

విషాదానికి కారణమైన ట్యాంకర్ ఆలస్యాన్ని.. రాజకీయాల కోసం వాడుకోవాలనుకోవడం తగదని ఎమ్మెల్యే హితవు పలికారు. వైద్యులకు అండగా నిలబడటంతో పాటు.. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:

రుయా ఘటన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం: సీఎం

ABOUT THE AUTHOR

...view details