ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ministers Comments On Amaravati: 'మూడు రాజధానులు వచ్చి తీరుతాయి' - తిరుపతిలో అమరావతి రైతుల సభ

వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు మంత్రులు పెద్దిరెడ్డి, సీదిరి అప్పలరాజు. వేర్వురుగా మీడియాతో మాట్లాడిన మంత్రులు.. రాష్ట్రానికి 3 రాజధానులు వచ్చి తీరుతాయన్నారు.

Ministers Comments On Amaravati
Ministers Comments On Amaravati

By

Published : Dec 17, 2021, 8:48 PM IST

Ministers Comments On Amaravati: తెదేపా ముసుగులో అమరావతి రైతుల ఉద్యమం నడుస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. భాజపాతో ఎలాగైనా జట్టు కట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని అన్నారు. ఎన్ని పార్టీలు జట్టు కట్టినా.. వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

3 రాజధానులు వచ్చి తీరుతాయి - మంత్రి సీదిరి
Seediri AppalaRaju comments on 3 Capitals: రాష్ట్రానికి 3 రాజధానులు వచ్చి తీరతాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఉత్తరాంధ్ర ఐకాస ఏర్పాటు చేశామన్న ఆయన.. విశాఖలో పాలనా రాజధానికి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు విడిచిపెట్టి సీపీఐ ప్రవర్తిస్తోందని విమర్శించారు.

తిరుపతిలో మార్మోగిన అమరావతి నినాదం..
అమరావతి అందరిదీ అంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా కదం తొక్కిన రైతులు.. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని.. తిరుపతిలో రాజధాని పరిరక్షణ మహోద్యమ సభ నిర్వహించారు. వివిధప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులు, ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రమైంది. అమరావతి రైతులకు మద్దతుగా ప్రజలు ఆకు పచ్చకండువాలు.. మెడలో వేసుకుని సభకు వచ్చారు. కళాకారులు ఉద్యమగీతాలు ఆలపించగా.. రైతులు, మహిళలు ఆకుపచ్చ కుండువాలు గాల్లో తిప్పుతూ గొంతుకలిపారు.

ఈ సభలో మాట్లాడిన చంద్రబాబు... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాజధాని రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. "జగన్‌ ఎన్నికల ముందు ఏం చెప్పారు? అసెంబ్లీలో ఏం చెప్పారు? ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం నాకిష్టం లేదు.. రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పారు. ఎన్నికల ముందు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోవాలి. మడమతిప్పనన్న జగన్‌.. అమరావతిపై ఎందుకు మాట తప్పారు? అమరావతిపై కుల ముద్రవేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారందరిదీ ఏ కులం? జగన్‌ ఇష్టానుసారం చేస్తే కుదరదు.

అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజలు కోరుకున్న ప్రజా రాజధాని. అమరావతి మునిగి పోతుందని దుష్ప్రచారం చేశారు. మూడేళ్లలో ఎప్పుడైనా మునిగిందా? అమరావతిలో భూమి గట్టిది కాదన్నారు.. హైదరాబాద్‌ కంటే గట్టి నేల అని చెన్నై ఐఐటీ నిపుణులు తేల్చారు. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అపోహలు సృష్టించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా... ధర్మ పోరాటంలో అంతిమ విజయం మనదే. త్యాగం, పోరాటం అమరావతి రైతులది. వారి త్యాగం 5కోట్ల ఆంధ్రుల కోసమే’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

MP Raghurama On Amaravati: ప్రజా భాగస్వామ్యంతో నిర్మించిన అమరావతిని నాశనం చేయడం దుర్మార్గమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. న్యాయస్థానం అండ రైతులకు ఉందన్న ఆయన.. రాజధాని అమరావతిని మార్చటం ఎవరి తరమూ కాదని అన్నారు.

ఇదీ చదవండి:

CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details