ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - తిరుమల వార్తలు

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వినాయక చవితి పండుగపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

minister-vellampalli-srinivasa-rao-visited-thirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

By

Published : Aug 21, 2020, 2:07 PM IST

తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.

వినాయక చవితి పండుగపై ప్రతిపక్షాలు, రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, పూజలు చేసుకుని ప్రజలు సురక్షితంగా ఉండాలన్నారు.

ఇవీ చదవండి:స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'

ABOUT THE AUTHOR

...view details