ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మనబడి - నాడు నేడుపై పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి సమీక్ష - Chief Secretary of School Education news

నాడు - నేడు పథకంలో భాగంగా చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి రెండవ దశ పనులను ప్రారంభిస్తామని అన్నారు.

Manabadi- naadu nedu Review meeting
మనబడి- నాడు నేడుపై సమీక్ష

By

Published : Feb 16, 2021, 1:15 PM IST

నాడు - నేడులో భాగంగా స్కూళ్లల్లో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. స్కూళ్లలో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. తిరుపతిలో నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేశారు. మనబడి - నాడు నేడుపై ఎస్వీయూ సెనెట్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో నాడు - నేడు కింద 1,533 పాఠశాలల్లో చేపట్టిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయని బి.రాజశేఖర్ తెలిపారు. రెండవ దశలో చేపట్టే పనులను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభిస్తామన్నారు. పనులను వేగవంతం చేసేందుకు సచివాలయాలలోని ఇంజనీర్​లను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ జరిగేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు ర్యాంకింగ్ ఇచ్చే విధంగా అకడెమిక్ పర్ఫార్మన్స్​ను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.


ఇదీ చదవండి:పుర పోరు: రెండు నగర, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details