ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 29, 2021, 4:35 PM IST

ETV Bharat / city

Karnataka Liquor seized : కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

Karnataka Liquor seized : చిత్తూరు-వేలూరు రోడ్డులో మాపాక్షి వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో.. అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత కర్ణాటక మద్యం పట్టుబడింది. వ్యానులో ఈ వద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Karnataka Liquor seized
తనిఖీల్లో నిషేధిత కర్ణాటక మద్యం స్వాధీనం

Karnataka Liquor seized : చిత్తూరు-వేలూరు రోడ్డులో మాపాక్షి వద్ద పోలీసులు తనిఖీలను నిర్వహించారు. ఈ క్రమంలో పాల వ్యానులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను గుర్తించారు. వాహనంలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా.. నిషేధిత కర్ణాటక మద్యాన్ని కర్ణాటక నుంచి, రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.20లక్షలు ఉండొచ్చని తెలిపారు.

నిందితులు పుణ్యసముద్రం కార్తీక్, రాళ్ళపల్లి సురేష్ బాబుపై.. జిల్లాలో అనేక కేసులు ఉన్నట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉమాశంకర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : HUNTERS ARREST: జింకల మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details