కరోనా కారణంగా.. దాదాపు ఏడాది తరువాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించిన తితిదే.. వ్యాక్సినేషన్ కొనసాగుతుండటంతో దశలవారీగా టోకెన్లను పెంచుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ 50 వేల 200 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25 వేల 621 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా 3 కోట్ల 11 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఆదివారమూ ఇదే రద్దీ కొనసాగే అవకాశముంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. తెలంగాణ రాష్ట్రం పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న అనంతరం.. తీర్థప్రసాదాలు అందుకున్నారు.
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. స్వామివారి సేవలో ప్రముఖులు - ttd latest news
తిరుమల దేవస్థానంలో భక్తులు బారులు తీరారు. కరోనా తరువాత తిరుగిరులు వేలాది మంది భక్తులతో కిటకిటలాడాయి.శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ 50 వేల 200 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. తెలంగాణ పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు శ్రీవారిని దర్శించుకున్నారు.
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. స్వామివారి సేవలో ప్రముఖులు