తిరుమలలో కైశికద్వాదశి ఆస్థానం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తిరుచ్చీపై తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం బంగారు వాకిలి చెంత ఆస్థానంను అర్చకులు వేడుకగా నిర్వహించారు.
Tirumala : శ్రీవారికి వైభవంగా.. "కైశిక ద్వాదశి ఆస్థానం" - తిరుమల శ్రీవారికి కార్తీకమాస ప్రత్యేక పూజలు
తిరుమలలో "కైశిక ద్వాదశి ఆస్థానం" కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తిరుచ్చీపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు.
![Tirumala : శ్రీవారికి వైభవంగా.. "కైశిక ద్వాదశి ఆస్థానం" Kaishikadvadashi seva for Srivaru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13645540-49-13645540-1637036079469.jpg)
వైభవంగా శ్రీవారికి కైశికద్వాదశి ఆస్థానం
వైభవంగా శ్రీవారికి కైశికద్వాదశి ఆస్థానం
ఏడాదిలో కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఊరేగింపు నిర్వహిస్తారు. వేకువజామున నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి : TTD : పరిమళాలు జల్లుతున్న శ్రీవారి పూజా పూల అగరుబత్తీలు...