ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2021, 3:26 PM IST

ETV Bharat / city

వందశాతం ఆన్​లైన్ క్లాసులకు వీలుగా సాంకేతికత అభివృద్ధి: మంత్రి సురేశ్

విద్యార్థులకు వందశాతం ఆన్‌లైన్‌ క్లాసులకు వీలుగా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు. 8వ తరగతి నుంచి కంప్యూటర్ కోడింగ్ పై తరగతులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

education minister adimulapu suresh
education minister adimulapu suresh

ఆన్‌లైన్‌ తరగతులకు సాంకేతిక అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... వందశాతం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులకు వీలుగా సాంకేతిక అభివృద్ధి చేస్తున్నామన్నారు.

'ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. పరిశోధనలకు పెద్దపీట వేయాలని సమావేశంలో తీర్మానం చేశాం. 8వ తరగతి నుంచి కంప్యూటర్ కోడింగ్‌పై తరగతుల నిర్వహణ చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం'- ఆదిమూలపు సురేశ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

ఈ ఏడాది 2.20 లక్షలమంది డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రవేశ అవకాశం కల్పించామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లోనూ ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపడుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

రూ.కోటి తీసుకుని తహసీల్దార్ మోసం చేశాడంటూ.. దంపతుల ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details