ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నికపై దాఖలైన రెండు పిటిషన్లు కొట్టివేత - తిరుపతి ఉప ఎన్నికపై దాఖలైన రెండు పిటిషన్లు కొట్టివేత వార్తలు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, భాజపా అభ్యర్థి రత్నప్రభ వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు..ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Dismissal of two petitions filed on Tirupati by-election
తిరుపతి ఉప ఎన్నికపై దాఖలైన రెండు పిటిషన్లు కొట్టివేత

By

Published : Apr 30, 2021, 4:37 PM IST

Updated : May 1, 2021, 1:52 AM IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు విచారించింది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, ఉప ఎన్నికను రద్దు చేయాలని భాజపా అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వ్యాజ్యాలపై విచారించిన న్యాయస్థానం..ఎలక్షన్‌ కమిషన్‌లో పిటిషన్‌ వేసుకోవాలని సూచించింది. అక్రమాలు జరిగాయని ఆధారాలున్నా..ఎలక్షన్‌ కమిషన్​ పిటిషన్‌కు అవకాశం ఉన్న సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం వ్యాజ్యాలను కొట్టేసింది.

రాష్ట్రంలో పరిషత్తు ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన, తెదేపా పిటిషన్లపై న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Last Updated : May 1, 2021, 1:52 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details