ప్రపంచ వ్యాప్త ప్రసిద్ధి పొందిన వారణాసి గంగా హారతిని.. రాష్ట్రానికి చెందిన చెందిన భక్తజన బృందం నేరుగా దర్శించుకుంది. దశాశ్వమేధ ఘాట్ లో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు.. ఎంతో ఆనందించినట్టు చెప్పారు. లాక్ డౌన్ కాలంలో నేరుగా వారణాసికి రాలేకపోయామని.. ఈటీవీ భారత్లో నిత్యం ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. గంగా హారతిని తిలకించామని చెప్పారు. క్రమం తప్పకుండా గంగా హారతిని తమకు అందించారంటూ ఈటీవీ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.
వారణాసిలో గంగా హారతి.. ఆంధ్ర భక్త బృందం సందడి - varanasi ganga harathi news update
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిత్యం జరిగే గంగా హారతి కార్యక్రమం ప్రసిద్ధి పొందింది. విశిష్టమైన ఈ కార్యక్రమాన్ని నేరుగా దర్శించుకోలేక.. లాక్ డౌన్ సమయంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో.. ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకను నేరుగా తిలకిస్తున్నారు. ఆంధ్రులు సైతం.. వారణాసిలో గంగా హారతిని దర్శించుకుని.. భావోద్వేగానికి గురయ్యారు.
![వారణాసిలో గంగా హారతి.. ఆంధ్ర భక్త బృందం సందడి ganga harathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9624365-396-9624365-1606035287107.jpg)
ganga harathi
ఈటీవీ భారత్లో గంగాహారతి పత్యక్ష ప్రసారంపై భక్తులు హర్షం
ఇవీ చూడండి: