Deputy Cm Narayana Swamy: 'ఎవరు.. ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు. పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన వైకాపాను ఓడించలేరు' అని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి బాలాజీ డైరీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... మతాన్ని, కులాన్ని చూపించి జనసేన నేత పవన్ ఓట్లు అడుగుతున్నారని నారాయణస్వామి ఆరోపించారు. 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేక.. పొత్తుల కోసం పవన్ కల్యాణ్ పాకులాడుతున్నారని విమర్శించారు. 175 స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ చేశారు. తెదేపా ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
పవన్ కల్యాణ్కు.. ఉప ముఖ్యమంత్రి సవాల్ - ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి
Narayana Swamy On Pawan Comments: ఎవరు.. ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైకాపాను ఓడించలేరని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మతాన్ని, కులాన్ని చూపించి జనసేన నేత పవన్ ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు.
![పవన్ కల్యాణ్కు.. ఉప ముఖ్యమంత్రి సవాల్ Narayana Swamy On Pawan Comments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15478851-1091-15478851-1654424289322.jpg)
Narayana Swamy On Pawan Comments