ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: నష్టాల్లో పర్యటక అభివృద్ధి సంస్థ తిరుపతి డివిజన్​ - తిరుపతి పర్యటక సంస్థపై కరోనా ప్రభావం వార్తలు

రాష్ట్రంలోనే అతిపెద్ద రవాణా విభాగం కలిగిన పర్యటక అభివృద్ధి సంస్థ తిరుపతి డివిజన్‌.... కరోనాతో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. 8నెలలుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా నిలిచిపోవటంతో... ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.

corona effect on tirupathi tourism wing
కరోనా ఎఫెక్ట్: నష్టాల్లో పర్యటక అభివృద్ధి సంస్థ తిరుపతి డివిజన్​

By

Published : Oct 17, 2020, 5:47 PM IST

రాష్ట్రంలోనే ప్రధానమైన పర్యటక అభివృద్ధి సంస్థ... తిరుపతి డివిజన్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొవిడ్ కారణంగా పర్యటక కార్యలాపాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రధాన నగరాలతోపాటు... తమిళనాడు, కర్ణాటక నుంచి బస్సుల రాక ఆగిపోయింది. శ్రీవారిని దర్శించుకొనే భక్తులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా... తిరుపతి డివిజన్‌కు అధిక ఆదాయం సమకూరేది. మార్చి నుంచి తితిదే పర్యాటక శాఖకు కేటాయించే దర్శన టికెట్ల కోటా నిలిపివేయటం వల్ల... అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా పర్యాటక సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

బస్సులు తిరగకపోయినా రహదారి పన్ను చెల్లించాల్సి వస్తోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దర్శన టికెట్లు పునరుద్ధరించాల్సిందిగా పర్యటక శాఖ కార్యదర్శి రజత్‌భార్గవ్‌... తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ రాశారు. దీంతో కొద్దిరోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details