ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్వారంటైన్‌కు తరలిస్తుండగా వివాదం - chittor news

గుడిపాలలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో.. గురువారం ఏడుగురు అనుమానితులను తిరుపతి స్విమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలిస్తుండగా... సరైన వసతులు కల్పించలేదని 108 సిబ్బందితో వారు వివాదానికి దిగారు.

Controversy while moving to Quarantine in chittor
క్వారంటైన్‌కు తరలిస్తుండగా వివాదం

By

Published : May 8, 2020, 2:11 PM IST

చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలంలో ఇటీవల ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులైనటువంటి ఏడుగురిని తిరుపతి స్విమ్స్​లోని క్వారంటైన్స్​కు తరలిస్తుండగా...మార్గమధ్యలో వాళ్లు సరైన వసతులు కల్పించలేదని 108 సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకున్న పూతలపట్టు ఎస్సై రాజ్‌కుమార్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి... పంపించారు.

ABOUT THE AUTHOR

...view details