ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాలూకి రాని బెయిల్.. జగన్​కు ఎలా వచ్చింది..?: చింతా మోహన్ - Chintamohan comments On Jagan

లాలూప్రసాద్ యాదవ్​కి ఇవ్వని బెయిల్.. అదే తరహా కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్​కి ఎలా వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థి చింతా మోహన్ ప్రశ్నించారు. వైకాపాకు ఓటేసినా.. లబ్ధి చేకూరేది భాజపాకేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రమే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.

చింతామోహన్
చింతామోహన్

By

Published : Apr 7, 2021, 12:55 PM IST

చింతామోహన్

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న బిహార్ మాజీముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్​కి ఇవ్వని బెయిల్... అదే తరహా కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్​కి ఎలా వచ్చిందని కేంద్ర మాజీమంత్రి, తిరుపతి లోక్​సభ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... బాలాజీ కాలనీ, నాలుగు కాళ్లమండపం, తిలక్​రోడ్​లలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చింతామోహన్... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు రెండు వేర్వేరు న్యాయాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి, సీఎం జగన్​కి ఉన్న సంబంధం ఏంటో ప్రజలకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. భాజపా, వైకాపా ఒకే నాణేనికి రెండు పార్శ్వాలని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. వైకాపాకి ఓటేసినా... లబ్ధి చేకూరేది భాజపాకేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రమే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details