ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా కుమార్తె ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి: చింతామోహన్

వివేకా కుమార్తె ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. ఆరు నెలల తరువాత జగన్ అధికారంలో ఉండరని ఆయన వ్యాఖ్యానించారు.

By

Published : Apr 4, 2021, 12:21 PM IST

congress leader chinta mohan
చింతామోహన్

ముఖ్యమంత్రి జగన్ ధర్మయుద్ధంలో గెలవలేరని తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ విమర్శించారు. వైఎస్ వివేకా కుమార్తై సునీత ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్​ పరిస్థితి..ఈసారి భాజపాకు రాబోతుందని చెప్పారు. అధిక ధరలు.. భాజపా పతనానికి ప్రధాన హేతువు అని తెలిపారు. తిరుపతిలో పవన్ పర్యటన వల్ల ప్రయోజనం శూన్యమని ఎద్దేవా చేశారు. జగన్ మీద కోపాన్ని షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారన్న ఆయన.. 6 నెలల తర్వాత జగన్ అధికారంలో ఉండరని జోస్యం చెప్పారు. ప్రలోభాలు లేకుంటే కాంగ్రెస్‌కు మళ్లీ ఆదరణ వస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details