ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేడు తిరుపతికి.. సీఎం జగన్

By

Published : Nov 13, 2021, 6:20 AM IST

Updated : Nov 13, 2021, 8:43 AM IST

ముఖ్యమంత్రికి జగన్ నేడు తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి 1గంటకు తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. మళ్లీ ఆదివారం మధ్యాహ్నం తిరుపతి బయలుదేరి వెళతారు. అక్కడ జరిగే జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.

నేడు తిరుపతికి సీఎం జగన్
నేడు తిరుపతికి సీఎం జగన్

సీఎం జగన్‌ శనివారం సాయంత్రం తిరుపతి పర్యటన ఖరారైంది. ఇవాళ తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి.. తిరిగి రాత్రి 1 గంటకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. మళ్లీ ఆదివారం మధ్యాహ్నం తిరుపతి బయల్దేరి వెళ్లి, అక్కడ జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు.

శనివారం సాయంత్రం 6.15కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు స్వాగతం పలుకుతారు. అనంతరం తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అదే రోజు రాత్రి 11.30కి తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 1 గంటకు తాడేపల్లికి చేరుకుంటారు. మళ్లీ తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1.15కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి తిరుపతి వెళ్తారు. తాజ్‌ హోటల్‌లో మధ్యాహ్నం జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు రేణిగుంట బయల్దేరనున్నారు. రాత్రి 8.30 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు.

ఇదీ చదవండి:Rains: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. జలదిగ్బంధంలోనే పలు ప్రాంతాలు

Last Updated : Nov 13, 2021, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details