ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వర్ణోత్సవ విజయ దివస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం జగన్

తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో జరగనున్న స్వర్ణోత్సవ విజయ దివస్ ఉత్సవాల ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం జగన్ హాజరుకానున్నారు.

By

Published : Feb 17, 2021, 10:14 PM IST

CM Jagan will be the chief guest at the Golden Jubilee Vijaya Diwas celebrations in Tirupati
స్వర్ణోత్సవ విజయ దివాస్ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం జగన్

తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో గురువారం స్వర్ణోత్సవ విజయ దివస్ వేడుకలు నిర్వహించనున్నారు. అక్కడి ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు పరిశీలించారు. మిలిటరీ ఆధీనంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఈ వేదిక వద్దకు సీఎం చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. 1971 సంవత్సరంలో భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన తిరుపతికి చెందిన విశ్రాంత సైనికులను ముఖ్యమంత్రి జగన్ సన్మానించనున్నారు.

ఇదీ చదవండి:

రేపు తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ విజయ దివాస్ ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details