తిరుమల మొదటి కనుమ దారిలో రెండు కార్లు ఢీ కొన్నాయి. శ్రీవారి దర్శనానంతరం తిరుగు పయనమైన యాత్రికుల కారు 35వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొంది. వెనుక వస్తున్న మరో కారు ప్రమాదానికి గురైన కారును ఢీకొనడంతో.. హైదరాబాద్కు చెందిన నలుగురు భక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో మొదటి కనుమ దారిలో కొంత సమయం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
తిరుమల కనుమ దారిలో ప్రమాదం.. నలుగురు భక్తులకు గాయాలు - తిరుమల తాజా వార్తలు
తిరుమల మెుదటి కనుమ దారిలో 35వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. భక్తులు శ్రీవారి దర్శనం ముగించుకుని వస్తుండగా ఘటన జరిగింది.
![తిరుమల కనుమ దారిలో ప్రమాదం.. నలుగురు భక్తులకు గాయాలు tirumala ghat road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10096128-802-10096128-1609596908242.jpg)
తిరుమల కనుమ దారిలో ప్రమాదం