ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుపతి ఉపఎన్నికలో పోటాపోటీగా ప్రచారం

By

Published : Mar 30, 2021, 9:41 PM IST

Updated : Mar 30, 2021, 10:24 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలో తమనే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

campaign on tirupati by election
తిరుపతి ఉపఎన్నిక ప్రచారం

తిరుపతి లోక్​సభ ఉపఎన్నికలో అధికార, ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. లోక్​సభ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని ప్రాంతాల్లో అధికార ప్రతిపక్షాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తెదేపా అభ్యర్ధి పనబాక లక్ష్మి.. గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. గ్రామాల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులను పలకరించారు. ఉప ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని.. ప్రజా సమస్యలపై లోక్​సభలో పోరాటం చేస్తానని హామీ ఇస్తున్నారు.

శ్రీకాళహస్తిలో గురుమూర్తి...

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. గురుమూర్తిని గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.. ఓటర్లను కోరారు. ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

విశాఖ ఉక్కుపై హైకోర్టులో ఐపీఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ పిల్

Last Updated : Mar 30, 2021, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details