ధర్మపోరాటానికి మద్దతుగా నల్ల బెలూన్లతో బైక్ ర్యాలీ
దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్దతుగా తిరుపతిలో తెదేపా నేతలు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేశారు. చంద్రబాబుకు అండగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు.
By
Published : Feb 11, 2019, 6:46 PM IST
దిల్లీలో ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా భారీ బైక్ ర్యాలీ
దిల్లీలో ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా భారీ బైక్ ర్యాలీ
ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్దతుగా తిరుపతిలో తెదేపా నేతలు, కార్యకర్తలు సంఘీభావ దీక్ష చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటూ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు నలుపు రంగు బెలూన్లతో బైక్ ర్యాలీ చేశారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆయనకు అండగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు.