ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 1, 2021, 3:39 PM IST

ETV Bharat / city

న్యాయం చేయాలంటూ 'రుయా' బాధితురాలి ఆందోళన..

రుయా ఘటనలో భర్తను కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు.. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టింది. ఆమెకు మద్దతుగా భాజపా నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.

bjp protest at ruya
bjp protest at ruya

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక తన భర్త ప్రాణాలు కోల్పోయారని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ లక్ష్మీ అనే మహిళ ఆందోళన చేపట్టింది. ఆమెకు మద్దతుగా భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ఘటన జరిగి 20రోజులు కావొస్తున్నా బాధితురాలికి న్యాయం చేయకపోవడం శోచనీయమన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. తక్షణమే బాధితురాలికి పరిహారం అందించక పోతే ఆందళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details