ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 1, 2021, 9:37 AM IST

Updated : Jul 1, 2021, 12:50 PM IST

ETV Bharat / city

TTD: 'ఆధ్యాత్మిక చింతన ఉన్నవారినే బోర్డు సభ్యులుగా నియమించండి'

తితిదే బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చవద్దని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారినే బోర్డు సభ్యులుగా నియమించాలని సూచించారు.

ttd board members
భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి

తిరుమలలో మాట్లాడుతున్న భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి

తితిదే బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చవద్దని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. బోర్డులో నిబంధనలు ప్రకారం సభ్యులను నియమించాలని సూచించారు. గతంలో కొంతమంది సభ్యులు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు.

శ్రీవారి దర్శన, సేవా టిక్కెట్లను గతంలో అక్రమంగా విక్రయించారని అన్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారినే బోర్డు సభ్యులుగా నియమించాలని.. పరిమిత సంఖ్యలో సభ్యులను కేటాయించాలని రాష్ట్ర భాజపా తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత..

తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ పోతుల సునీత దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

Vaccine: కరోనా టీకా కోసం వెళ్తే.. రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారని నర్సు ఆందోళన

మన్యంలో మావోయిస్టుల బంద్.. ఏవోబీలో విస్తృతంగా తనిఖీలు

Last Updated : Jul 1, 2021, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details