ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే పిటిషన్ విచారణ వాయిదా - తితిదే పరువునష్టం దావా తాజా వార్తలు

తితిదే దాఖలు చేసిన పరువునష్టం దావా ఉపసంహరణ పిటిషన్​పై విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసినట్లు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ తెలిపారు.

తితిదే పిటిషన్ విచారణ వాయిదా
తితిదే పిటిషన్ విచారణ వాయిదా

By

Published : Oct 22, 2020, 11:23 AM IST

తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ. రమణ దీక్షితులు ఎంపీ వీ.విజయసాయిరెడ్డిపై తితిదే 2018లో పరువు నష్టం దావా దాఖలుచేసింది. ప్రస్తుతం ఆ దావా తిరుపతి పదో అదనపు జిల్లా సెషన్సు కోర్టులో విచారణలో ఉంది. ఈ నెల 14న ఈ దావాలో తెలంగాణకు చెందిన హిందూ జనసేన శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. గత నెల 14న తితిదే దావా ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసిన విషయం బయటపడింది. ఇంప్లీడ్ పిటిషన్​లో తితిదే, ఎ.వి రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి తరఫున కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details