ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2020, 5:30 PM IST

ETV Bharat / city

'మా గ్రామంలో కరోనా మృతదేహాల ఖననం వద్దు'.. గ్రామస్థుల ఆందోళన

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామస్థులు.. తమ గ్రామ సమీపంలో కరోనా మృతదేహాలు ఖననం చేయొద్దని ఆందోళనకు దిగారు. తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి మృతదేహాలను గ్రామంలోని మున్సిపాలిటీ స్థలంలో ఖననం చేసేందుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు భయాందోళనతో.. ఆ స్థలానికి వెళ్లే మార్గంలో ముళ్ల కంచె వేశారు.

కరోనా మృతదేహాల ఖననం గ్రామంలో వద్దని స్థానికులు ఆందోళన
కరోనా మృతదేహాల ఖననం గ్రామంలో వద్దని స్థానికులు ఆందోళన

కరోనా మృతదేహాలు తమ గ్రామ పరిసరాల్లో ఖననం చేయొద్దని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను గ్రామ సమీపంలోని పంప్​ హౌస్​ వద్ద ఖననం చేసేందుకు రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేశారు. సుమారు 70 ఎకరాల మున్సిపాలిటీ స్థలాన్ని అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో గ్రామస్థులు ఆందోళనకు గురై.. పంప్ హౌస్​కి వెళ్లే మార్గాన్ని ముళ్ల కంచెతో మూసివేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details