తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఆర్కిటెక్ ఇంజనీర్ శ్రీనివాస్.. గయా నుంచి రాష్ట్రానికి వస్తున్న పురుషోత్తం ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. రైలులో అతనితో పాటు భార్య విజయ, కుమారుడు కూడా ఉన్నారు. శ్రీనివాస్ రైలులో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యాడు. రైలు జమ్షడ్పూర్లోని టాటానగర్కు చేరుకున్న సమయంలో.. శ్రీనివాస్ అకస్మాత్తుగా మరణించాడు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది.. మృతదేహాన్ని టాటానగర్ రైల్వేస్టేషన్లో ఉంచారు. అతని భార్య విజయ, కుమారుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. విజయకు కరోనా పాజిటివ్గా తేలగా, కుమారుడికి నెగటివ్గా నిర్థరణ అయ్యింది. టాటానగర్ రైల్వే స్టేషన్లోనే ఇద్దరిని వేర్వేరు చోట్ల ఉంచారు. శ్రీనివాస్ మృతిచెందినట్లు.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని రైల్వే పోలీస్ అధికారి తెలిపారు.
భర్త రైలులో మృతి.. భార్యకు కరోనా పాజిటివ్.. - rajamundry resident found dead in Purushottam Express
గయా నుంచి రాష్ట్రానికి వస్తున్న పురుషోత్తం ఎక్స్ప్రెస్లో.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. మృతుడు.. రాజమండ్రికి చెందిన ఆర్కిటెక్ శ్రీనివాస్గా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని.. జమ్షడ్పూర్లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో ఉంచారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
![భర్త రైలులో మృతి.. భార్యకు కరోనా పాజిటివ్.. railway station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11455960-669-11455960-1618810775750.jpg)
పురుషోత్తం రైలులో రాజమండ్రికి చెందిన వ్యక్తి మృతి