ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రహశకలాల గుర్తింపులో రాజమహేంద్రవరం వాసికి నాసా ధ్రువీకరణ పత్రం - గ్రహ శకలాల గుర్తించిన రాజమహేంద్రవరం వాసి న్యూస్

అంతరిక్షంలో గ్రహశకలాలను గుర్తించేందుకు నాసా సహకారంతో డిపార్ట్​మెంట్ ఆఫ్ సైస్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కేంద్రం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసింది. ఈ బృందాలు గ్రహశకలాలు గుర్తించి నివేదిక అందించాయి. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన ఏడుగురు సభ్యుల బృందానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మేకా సుసత్య రేఖ నాయకత్వం వహించారు. అంతరిక్షంలో కొత్తగా 12 గ్రహ శకలాలు గుర్తించనట్లు ఆమె తెలిపారు.

సుసత్య రేఖ
సుసత్య రేఖ

By

Published : Nov 12, 2020, 5:49 PM IST

అంతరిక్షంలో కొత్తగా 12 గ్రహ శకలాలను గుర్తించినట్టు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మేకా సుసత్య రేఖ తెలిపారు. అంతరిక్షంలో గ్రహ శకలాలను గుర్తించేందుకు నాసా సహకారంతో డిపార్ట్​మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కేంద్రం రెండు నెలల క్రితం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

నాసా ధ్రువీకరణ పత్రం

ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన ఏడుగురు సభ్యుల బృందానికి సుసత్య రేఖ నాయకత్వం వహించారు. ఈ బృందం గుర్తించిన గ్రహ శకలాల వివరాలతో నివేదిక రూపొందించి నాసాకు వివరించారు. నాసా వాటిని ధ్రువీకరించి పత్రాలు అందించినట్టు సుసత్య రేఖ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details