ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బడ్జెట్​ కేటాయింపులపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తాం' - Parliament will debate on allocations to ap : MP Bharat

బడ్జెట్​లో రాష్ట్రానికి  జరిగిన కేటాయింపులు అసంతృప్తిగా ఉన్నాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అన్నారు.  విభజనతో నష్టపోయిన ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్​లో పోరాడతామని చెప్పారు.

బడ్జెట్​ కేటాయింపులపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తాం:ఎంపీ భరత్

By

Published : Jul 6, 2019, 4:35 PM IST

బడ్జెట్​ కేటాయింపులపై పార్లమెంట్​లో ప్రశ్నిస్తాం:ఎంపీ భరత్

ఆంధ్రప్రదేశ్​ను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని..బడ్జెట్​లో మరిన్ని కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని రాజమేంద్రవరం ఎంపీ మార్గాని భరత్​ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని అన్నారు. ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని...రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్​లో పోరాడే విధంగా కార్యాచరణ ఉండబోతుందని అన్నారు. సోమవారం నుంచి పద్దులపై చర్చ జరగనున్న నేపథ్యంలో.. వైకాపా రాజ్యసభ, లోక్​సభ సభ్యులందరమూ కలిసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details