తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాదుల హత్యను ఖండిస్తూ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. న్యాయవాదులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు సామాన్యులకు ఎలా కల్పిస్తాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగత శివ ప్రశ్నించారు. దంపతుల హత్యను ఖండిస్తున్నామని మహిళా న్యాయవాదులు అన్నారు.
కర్నూలులో ర్యాలీ..