ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో న్యాయవాద దంపతుల హత్యపై.. రాష్ట్రంలో నిరసనలు - తూర్పుగోదావరి వార్తలు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నాలు చేపట్టారు. న్యాయవాదులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు సామాన్యులకు ఎలా కల్పిస్తాయని ప్రశ్నించారు.

lawyers Protest for  protect
న్యాయవాదుల నిరసనలు

By

Published : Feb 18, 2021, 4:18 PM IST

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాదుల హత్యను ఖండిస్తూ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. న్యాయవాదులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు సామాన్యులకు ఎలా కల్పిస్తాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగత శివ ప్రశ్నించారు. దంపతుల హత్యను ఖండిస్తున్నామని మహిళా న్యాయవాదులు అన్నారు.

కర్నూలులో​ ర్యాలీ..

కర్నూలులో న్యాయవాదాలు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాద దంపతుల హత్యను వ్యతిరేకిస్తూ చేపట్టిన రెండురోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా... ఇవాళ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'భాజపా నాయకులపై కేసులు పెట్టడం అన్యాయం'

ABOUT THE AUTHOR

...view details