ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nadendla Manohar Fires On YSRC Govt: రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోంది - నాదెండ్ల మనోహర్ - నాదెండ్ల మనోహర్

వైకాపా ప్రభుత్వంపై.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం(Nadendla Manohar Fires On YSRC Govt) వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన.. దివాళా తీయించే దిశగా పాలన సాగుతోందని(Nadendla Manohar on financial crisis in ap) విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగకుండా.. అధికార పార్టీ అన్నివిధాలా ప్రయత్నించిందని ఆరోపించారు.

Nadendla Manohar
Nadendla Manohar Fires On YSRC Govt

By

Published : Nov 28, 2021, 9:27 PM IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగజారిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar Fires On YSRC Govt) అన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించే దిశగా(financial crisis in andhra pradesh) పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేటలో పర్యటించిన ఆయన (Nadendla Manohar tour in eastgodavari district) కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు.

అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగకుండా ఎన్ని విధాల యత్నించినా.. అడ్డుకోవడంలో జనసైనికులు సఫలమయ్యారని అన్నారు. పేదలకు కుట్టుమిషన్లు, నగదు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల ప్రమాదంలో చనిపోయిన పండూరుకు చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు ముమ్మిడి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి.. 5లక్షల బీమా చెక్కును అందించారు.

వెంకటేశ్వర్లు కుటుంబానికి చెక్కు అందజేత..
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండల కొత్తూరు గ్రామానికి చెందిన జనసైనికుడు వెంకేటశ్వర్లు కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. రూ. 5 లక్షల చెక్​ను నాదెండ్ల మనోహర్ కుటుంబసభ్యులకు అందజేశారు. పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వెంకటేశ్వర్లు.. కొద్దిరోజుల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ మేరకు అతని కుటుంబాన్ని పరామర్శించిన నాదెండ్ల.. బీమా చెక్​ను అందజేశారు.

ఇదీ చదవండి:

HEAVY RAINS IN AP: నిలువెల్లా జల ఖడ్గపు గాయాలే.. మళ్లీ ఉరుముతున్న వరుణుడు!

ABOUT THE AUTHOR

...view details