ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిని మార్చొద్దంటూ... ముఖ్యమంత్రికి గ్రీటింగ్​ కార్డులు

రాజధాని విషయంలో రాజమహేంద్రవరం ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. అమరావతికి అన్యాయం చేయొద్దంటూ గ్రీటింగ్ కార్డులపై సంతకాలు చేశారు. వీటిని ముఖ్యమంత్రికి పంపనున్నారు.

By

Published : Jan 1, 2020, 5:21 PM IST

Greeting cards will be sent to the CM to change his mind
ముఖ్యమంత్రికి గ్రీటింగ్​ కార్డులు

రాజధానిని మార్చొద్దంటూ... సీఎంకు గ్రీటింగ్​ కార్డులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తెదేపా నేతలు రాజమహేంద్రవరంలో సంతకాల సేకరణ చేపట్టారు. పార్టీ స్థానిక కార్యాలయంలో సంతకాల సేకరణను నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి జగన్​ మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ నూతన సంవత్సవ శుభాకాంక్షలను తెలిపే కార్డులపై ప్రజలు సంతకాలు చేశారు. అమరావతిపై ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తెలిపారు. ఈ కార్డులను ముఖ్యమంత్రికి పంపుతామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details