ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 20, 2021, 1:43 PM IST

ETV Bharat / city

'విశాఖ ఉక్కును ప్రైవేట్ ‌పరం చేస్తే ప్రజలు సహించరు'

తనపై ఉన్న కేసుల దృష్ట్యా సీఎం జగన్.. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.

ex mp harsha kumar comments on privatization of vishaka steel plant
ex mp harsha kumar comments on privatization of vishaka steel plant

విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలు సహించబోరని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. పరిశ్రమను కాపాడుకోకపోతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. తనపై ఉన్న కేసుల దృష్ట్యా సీఎం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర అని అంటున్నారని విమర్శించారు. పరిశ్రమ నష్టాలను పూడ్చడానికి భూములు అమ్మేస్తారా అని నిలదీశారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హర్షకుమార్‌ హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details