ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రైవేటుకు దీటుగా విద్య అందించేందుకే.. అమ్మ ఒడి'

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం డీఎంహెచ్​ఎస్ పాఠశాలలో అమ్మ ఒడి రెండో విడత పథకాన్ని ఎంపీ భరత్ ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగానికి ముఖ్యమంత్రి జగన్​ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.

By

Published : Jan 12, 2021, 1:14 PM IST

Ammavodi scheme second term
అమ్మఒడి పథకం రెండో విడత ప్రారంభం

రాజమహేంద్రవరం డీఎంహెచ్ఎస్ పాఠశాలలో అమ్మఒడి పథకం రెండో విడత ఎంపీ భరత్ చేతుల మీదుగా ప్రారంభమైంది. పేదలకు విద్యను చేరువ చేసేందుకు సీఎం ఈ పథకం ప్రవేశపెట్టారని ఎంపీ అన్నారు. కార్పొరేట్ విద్య అందరికీ అందేందుకు అమ్మఒడి నగదు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్​ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోని పిల్లలకు విద్యనందించేందుకు టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details