Kotamreddy:"విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని...సీఎం జగన్ చీకటిమయం చేశారు" - నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Kotamreddy Srinivasulu Reddy: విద్యుత్ కోతలపై నెల్లూరులో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిరసన చేపట్టారు. ఇంటింటికి విసనకర్రలు, కొవ్వొత్తులు శ్రీనివాసులురెడ్డి పంచారు. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని చీకటితో నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![Kotamreddy:"విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని...సీఎం జగన్ చీకటిమయం చేశారు" TDP leader Kotamreddy Srinivasulu Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14970556-33-14970556-1649482531962.jpg)
తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
Kotamreddy Srinivasulu Reddy: విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారంటూ తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత ఇదంటూ నగర వార్డుల్లో ప్రచారం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా నెల్లూరులో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆందోళన చేపట్టారు. ఇంటింటికి విసనకర్రలు, కొవ్వొత్తులు పంచుతూ నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అటు ధరల పతనం... ఇటు విద్యుత్ కోతలు... బెల్లం పరిశ్రమల ఆవేదన