నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. అభివృద్ధి పనులు పరిశీలించారు. అన్ని వర్గాల సంక్షేమమే తెదేపా ధ్యేయమన్నారు.
నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి
By
Published : Mar 2, 2019, 4:07 PM IST
నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన
నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ తెదేపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధే.. పార్టీకి ఘన విజయం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని బారాషాహిబ్ దర్గాను 23 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.