ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2021, 7:39 PM IST

ETV Bharat / city

రూ.40 కోట్లతో నెల్లూరు సుందరీకరణ: మంత్రి బొత్స

నెల్లూరులో త్వరలో సుందరీకరణ పనులు చేపడతామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్​తో కలిసి ఆయన నగరంలో పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

minister botsa satyanarayana
minister botsa satyanarayana

నెల్లూరును 40 కోట్ల రూపాయలతో సుందరంగా మారుస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నగరంలోని మూలపేటలో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో కోనేరును తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. శనివారం జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్​తో కలిసి మంత్రి బొత్స నెల్లూరులో పర్యటించారు. సంతపేటలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్న గోసా ఆసుపత్రికి ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే వెంకటేశ్వరపురం టిడ్కో గృహాలను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details