ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐసీఎంఆర్ బృందం పర్యటనపై అధికారిక సమాచారం లేదు: జేసీ

By

Published : May 24, 2021, 6:28 PM IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఐసీఎంఆర్ బృందం పర్యటనపై తమకు ఎటువంటి సమాచారం లేదని జేసీ గణేశ్‌కుమార్ తెలిపారు. ఆనందయ్య మందు శాస్త్రీయతపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు.

nellore jc on icmr visit
ఐసీఎంఆర్ బృందం పర్యటనపై అధికారిక సమాచారం లేదు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఐసీఎంఆర్ బృందం పర్యటనపై జేసీ గణేశ్‌కుమార్ వివరణ ఇచ్చారు. ఐసీఎంఆర్ బృందం పర్యటనపై తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని పేర్కొన్నారు.

ఆనందయ్య మందుపై క్షేత్రస్థాయి సర్వే జరుగుతోందని, ఇప్పటికే ఔషధ నమూనాలను ఆయుష్ బృందం సేకరించిందని ఆయన అన్నారు. మందు పనితీరు, ఇతర అంశాలపై దిల్లీలోనూ పరిశోధన జరుగుతున్నట్లు జేసీ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details