ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అప్పటి వరకు కృష్ణపట్నం ఔషధ పంపిణీని నిలిపివేయండి'

By

Published : May 22, 2021, 3:31 PM IST

శాస్త్రీయత నిరూపణ అయ్యే వరకు కృష్ణపట్నం ఔషధ పంపిణీని ప్రభుత్వం నిలిపివేయాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు కోరారు. అప్పటివరకూ ప్రజలు ఓపిక పట్టాలన్నారు. ఐసీఎంఆర్ కూడా మందు పనితీరును పరిశీలించి.. ఫలితాలను తొందరగా వెల్లడించాలని అభిప్రాయపడ్డారు.

anandaiah medicine for corona
ap jana vignana vedika

శాస్త్రీయత, సామర్ధ్యం నిరూపణ అయ్యే వరకు కృష్ణపట్నం ఔషధ పంపిణీని ప్రభుత్వం నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని జన విజ్ఞాన వేదిక, ప్రజా ఆరోగ్య వేదిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆయూష్, ఐసీఎంఆర్ అధికారులు మందు పనితీరును వెంటనే పరిశీలించి ఫలితాలను వెల్లడించాలని కోరారు. ప్రజలు కూడా ఓపిక పట్టాలని పిలుపునిచ్చారు.

కొవిడ్ నిబంధనలు పాటించకుండా మందు పంపిణీ చేశారని, గందరగోళం మధ్య ప్రజలు ఇబ్బందులు పడ్డారని వివరించారు. దీనివల్ల కొవిడ్ వ్యాప్తికి కారణం అయ్యారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details