ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దళారి మాఫియాను వదిలేసి...దళిత రైతుపై కేసులా?'

పంట దిగుబడి లేక నష్టపోయినా రైతులకు...వైకాపా నేతలు సరైనా గిట్టుబాటు ధర కూడా దక్కనీయకుండా చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. దీంతో పాటు ధాన్యం కొనుగోలులో సైతం అక్రమాలు జరిగాయని విమర్శించారు. నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన రైతు పేరుతో 57 పుట్ల ధాన్యం విక్రయించినట్లు, రూ. 8 లక్షలు లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటే....అసలు రైతు పండించింది 8 పుట్ల ధాన్యమని, దానిని విధిలేక రూ.10 వేలకే అమ్ముకున్నారని తెలిపారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువకు దళారులు కొనుగోలు చేసినా వారిపై కేసు పెట్టకుండా...తిరిగి ఆ రైతుపై కేసు పెట్టారని ఆరోపించారు.

By

Published : Nov 7, 2020, 10:41 PM IST

somireddy
somireddy

రెండో పంటలో నెల్లూరు జిల్లా రైతాంగం దాదాపు రూ.700 కోట్లు నష్టపోయారని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులకు..పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కూడా దక్కనీయకుండా చేశారని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు జరగలేదంటూ స్థానిక ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ డేటాను తెదేపా జిల్లా కార్యాలయానికి పంపితే, ఆ జాబితాలో అనికేపల్లికి చెందిన జైపాల్ పేరుతో 57 పుట్ల ధాన్యం విక్రయించినట్టు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. జైపాల్ పండించిన 8 పుట్ల ధాన్యాన్ని విధిలేని పరిస్థితుల్లో 10,100 రూపాయల లెక్కన దళారులు మస్తాన్, వెంకటేశ్వర్లుకు అమ్ముకున్నారని సోమిరెడ్డి తెలిపారు. అయితే జైపాల్ పేరుతో 8 లక్షల రూపాయలకు పైగా లావాదేవీలు జరగడంతో ఆయన కలెక్టరేట్​లో అధికారులకు ధాన్యం కొనుగోలు అక్రమాలను తెలియజేశారన్నారు.

అధికారులకు చెప్పిన తర్వాత దుర్మార్గంగా జైపాల్​ను వెంకటాచలం ఎస్సై స్టేషన్​కు తీసుకెళ్లి, దళారుల ఎదుట విచారణ చేశారని చెప్పారు. విచారణ చేసిన వీడియోను ఎస్సై ఎమ్మెల్యేకు పంపితే, దానిని మీడియాకు విడుదల చేశారని తెలిపారు. జైపాల్ ధాన్యం కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకున్నాడనేందుకు పోలీసులు విడుదల చేసిన వీడియోనే నిదర్శనమన్నారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేశామని ఎస్సై సమక్షంలోనే ఒప్పుకున్న దళారులపై ఏం చర్యలు తీసుకున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details