ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధరల పతనం.. రోడ్లపై నిమ్మకాయల్ని పారబోసిన రైతులు

ఉత్తర భారతంలో అధిక వర్షాల కారణంగా.. నిమ్మకాయ ధరలు పడిపోయాయి. నెల్లూరు జిల్లా రైతులు, వ్యాపారులు ఈ ప్రభావంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. రోడ్లపైనే నిమ్మకాయల్ని పారబోశారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని వాపోయారు.

By

Published : Aug 4, 2021, 6:07 PM IST

నిమ్మకాయలు
నిమ్మకాయలు

నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్ ఆవరణంలో రోడ్డుపై రైతులు, వ్యాపారస్తులు నిమ్మకాయల్ని పారబోశారు. ఈశాన్య రాష్ట్రాలైన మహారాష్ట్ర, దిల్లీ, బీజాపూర్, ఆగ్రా ప్రాంతాల్లో.. వర్షాలు అధికంగా కురుస్తుండడంతో ధరలు భారీగా పతనం అయ్యాయని ఆవేదన చెందారు. చేసేది లేక ఇలా రోడ్డుపై పారబోయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఇలాంటి సమస్య రాలేదని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details