ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 1, 2021, 1:29 PM IST

Updated : May 1, 2021, 5:40 PM IST

ETV Bharat / city

నలుగురు కొవిడ్​ రోగులు మృతి.. ఆక్సిజన్​ అందకనే అంటున్న బంధువులు!

Two Kovid patients die at Care Hospital in kurnool
Two Kovid patients die at Care Hospital in kurnool

12:32 May 01

కర్నూలులోని కేఎస్‌ కేర్ ఆస్పత్రిలో ఘటన

నలుగురు కొవిడ్​ రోగులు మృతి.. ఆక్సిజన్​ అందకనే అంటున్న బంధువులు!

రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆక్సిజన్​ కొరత వెంటాడుతూనే ఉంది. తాజాగా కర్నూలులోని కేఎస్‌ కేర్ ఆస్పత్రిలో నలుగురు కొవిడ్‌ రోగులు మృతి చెందారు. వారు ఆక్సిజన్​ అందకనే మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆక్సిజన్‌ లేదని ఆందోళనతో ఇతర రోగులు.. వేరే ఆస్పత్రులకు వెళ్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ వీర పాండియన్...  నలుగురు రోగులు చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆక్సిజన్‌ అందకనే వారు చనిపోయారని, అనుమతి లేకుండానే కొవిడ్‌ చికిత్సలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

కరోనా కాటుతో ఊపిరి తీసుకున్న దంపతులు

Last Updated : May 1, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details