ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sivarathri in Srisailam : శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు.. - శ్రీశైలానికి కాణిపాకం పట్టువస్త్రాలు

Sivarathri in Srisailam : ద్వాదశ లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం, విజయవాడ దేవస్థానాల తరుపునుంచి పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు.

Sivarathri in Srisailam
శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు...వివిధ దేవస్థానాల నుంచి అందజేత...

By

Published : Feb 26, 2022, 4:12 PM IST

Sivarathri in Srisailam : ద్వాదశ లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరఫున చైర్మన్ మోహన్ రెడ్డి, సభ్యులు రామసుబ్బమ్మ, ఈవో వెంకటేష్ పట్టు వస్త్రాలు తీసుకొచ్చి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు సమర్పించారు.

శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు...

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున ఈవో భ్రమరాంబ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి శ్రీశైల దేవస్థానం ఈవో లవన్న, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి :TTD SARVADARSHNAM: శ్రీవారి సర్వదర్శన భక్తులకు శుభవార్త..

ABOUT THE AUTHOR

...view details