ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 21, 2020, 8:02 PM IST

ETV Bharat / city

'వారి అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తే సహించం'

కరోనా సోకి మృతి చెందిన వారికి తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులోని సుంకేశుల రోడ్డు వాసులు ఆందోళనకు దిగారు. రోడ్డెక్కి నినాదాలు చేశారు.

kurnool
kurnool

'వారి అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తే సహించం'

కరోనా మృతులకు తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ కర్నూలు శివారు సుంకేశుల రోడ్డు వాసులు ఆందోళన చేపట్టారు. సుంకేసుల రహదారిలోని శ్మశానంలో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఎంతోమంది నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఖననాలు చేయటాన్ని తప్పుబట్టారు. తమ ప్రాంతంలో ఈ ప్రక్రియను ఆపకపోతే సహించేది లేదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details