ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలులో రేషన్​ దుకాణాలు బంద్

By

Published : Apr 2, 2020, 3:16 PM IST

కర్నూలు జిల్లాలో రేషన్ దుకాణాల వద్ద ఉచితంగా బియ్యం తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా.. రేషన్​ దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్​ ఆదేశించారు.

కర్నూలులో రేషన్​ దుకాణాలు బంద్
కర్నూలులో రేషన్​ దుకాణాలు బంద్

కర్నూలులో రేషన్​ దుకాణాలు బంద్

కర్నూలు నగరంలో లాక్​డౌన్​ కార్యక్రమాన్ని అధికారులు కట్టుదిట్టం చేశారు. రేషన్ దుకాణాల వద్ద ఉచితంగా బియ్యం తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంపై జిల్లా కలెక్టర్ వీర పాండియన్ రేషన్ దుకాణాలను ముసివేయాలని ఆదేశించారు. రేషన్ తీసుకోని వారు దుకాణాల వద్దకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. మళ్లీ కలెక్టర్​ అధికారికంగా ప్రకటించే వరకు రేషన్​ దుకాణాలు ముసివేసే ఉంటాయని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details