ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 27, 2021, 5:42 PM IST

ETV Bharat / city

రోడ్డురోలర్‌తో బైక్‌ సైలెన్సర్లు ధ్వంసం

నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలు చేస్తూ తిరుగుతున్న ద్విచక్రవాహనాలపై కర్నూలు ట్రాఫిక్​ పోలీసులు చర్యలు చేపట్టారు. బైకుల నుంచి సైలెన్సర్లు వేరుచేసి వాటిని రోడ్డురోలర్‌తో ధ్వంసం చేయించారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్​ చేస్తామని ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాష హెచ్చరించారు.

silencers destroy at kurnool
రోడ్డురోలర్‌తో బైక్‌ సైలెన్సర్లు ధ్వంసం

రోడ్డురోలర్‌తో బైక్‌ సైలెన్సర్లు ధ్వంసం

కర్నూలులో నిబంధనలు ఉల్లంఘించి అధిక శబ్దంతో రోడ్లపై తిరిదే ద్విచక్ర వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. పెద్ద శబ్దాలు చేస్తున్న బైక్‌లను గుర్తించిన పోలీసులు.. ఆ వాహనాల నుంచి సైలెన్సర్లను వేరుచేశారు. 35 సైలెన్సర్లు రోడ్డుపై వేసి రోడ్డు రోలర్​తో తొక్కించారు. ఇకమీదట ఎవరైనా పెద్ద శబ్దాలు చేస్తూ.. బైక్‌లు తిప్పితే సీజ్‌ చేస్తామని ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details