కర్నూలు నగరంలో మాస్కులు ధరించకుండా రహదారులపై తిరిగే ప్రజలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రాజ్ విహార్ కూడలిలో పోలీసులు మాస్కులు ధరించకుండా తిరుగుతున్న నగరవాసులకు అవగాహన కల్పించారు. మరోసారి మాస్కు లేకుండా వస్తే... కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
కరోనా వేళ.. మాస్క్ తప్పనిసరి.. ప్రజలకు పోలీసుల కౌన్సెలింగ్...
కరోనా విజృంభిస్తోందని, ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కర్నూలు పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో... పోలీసులు చర్యలు చేపట్టారు. మాస్క్ లేకుండా తిరిగేవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
అసలే కరోనా.. మాస్క్ తప్పనిసరి'